ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/నస్పూర్, డిసెంబర్ 20: పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవో కదం సురేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయని, ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. మార్పులు చేర్పులు, చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిషరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల్లో తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాలలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు రాహుల్, మోతిలాల్, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.