భైంసాటౌన్, అక్టోబర్ 24 : ముథోల్ నియోజ కవర్గాన్ని రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత సేవ, అభివృద్ధి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సిరాల గ్రామం లో సోమవారం ఎమ్మెల్యే శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను పూలమాల శాలువాతో సన్మానించారు. అనం తరం ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మ్యానిఫెస్టోలోని అంశాల ను వివరించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్ర్తాలు అని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు ఇలా చెప్పు కుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధ్దిచేకూరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగా ణ భవితకు సోపానమని పేర్కొన్నారు. ఇంటింటా ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యేకు జనం నుంచి భారీ స్పందన లభించింది. మహిళలు మంగళహారతుల తో ఇంట్లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంటే తమ కుటుంబ సభ్యుడిలా అని భారీ మెజార్టీతో గెలిపించుకుం టామని భరోసా నిచ్చా రు. ఇంటింటా ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరి ని ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. కార్య క్రమంలో సర్పంచ్ సతీశ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.