బాసర, నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని బీఆర్ ఎస్ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొ న్నారు. శనివారం బాసర, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్,సావర్గం గ్రామాల్లో ప్రచారం నిర్వ హించారు. అడుగడుగునా ప్రజలు విఠల్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. బాసరలోని మైలాపూర్, బొర్రగణేశ్ కాలనీల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమా వేశంలో విఠల్రెడ్డి మాట్లాడారు.
అభివృద్ధిని కోరు కునే వారు కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే లా కృషి చేయాలన్నారు. హిందుత్వం అనేది ఎవ్వరి సొత్తుకాదని బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి పేర్కొన్నారు. విఠల్రెడ్డిని మరోసారి ఎమ్మె ల్యేగా గెలిపించాలని కోరారు. అన్న బావు సాటే మను మడు సచిన్బాబు సాటి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, యువ నాయకుడు కార్తీక్రావు, నరేశ్రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, డైరెక్టర్ రమేశ్ రావు, జ్ఞానీ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్య క్షు డు శ్యామ్, సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తానూర్, నవంబర్ 25 : ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నబావు సాటే మనుమడు సచిన్ బావు సాటే పేర్కొన్నారు. కోలేర్, మొగిలి, జౌలా(బీ) గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కానుగంటి పోతరెడ్డి, మాజీ ఎంపీపీ బాషేట్టి రాజన్న, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావ్, బీఆర్ఎస నాయకులు శ్రీనివాస్రెడ్డి, పుండ్లిక్, ఎంపీటీసీ లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుంటాల, నవంబర్ 25 : మండల కేంద్రం తో పాటు ఆయా గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నాయకులు గడపగడపకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు నమునా ఈవీఎం చూపి స్తూ ఓటును అభ్యర్థించారు. పదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి మరో సారి ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డిని గెలిపిం చాలని కోరారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఫమీం ఖాన్ ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మాజీ ఎంపీ టీసీ పోశెట్టి, పవర్ రాజు ఉన్నారు.
భైంసా, నవంబర్ 25 : భైంసాలోని పలు వార్డులలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ కారు గుర్తుకు ఓటేసి విఠల్ రెడ్డిని భారీ అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము, ప్రసన్న జిత్ ఆగ్రే, యశ్వంత్ బన్సోడే, సూరి, నరేందర్ ఉన్నారు. భైంసా మార్కెట్ ఏరియాలో మైనార్టీ బీఆర్ఎస్ నాయకులు శప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఐకాన్ యూత్ సభ్యులు అబ్దుల్ వాసే, జావీద్, రహమాన్, సాయినాథ్, అబ్దుల్ బరీ, అజార్, షేక్ అప్సర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్దుల్ అహద్ తదితరులు ఉన్నారు.
ముథోల్, నవంబర్ 25 : మండల కేంద్రంలో ని 1, 2, 3, 4 వార్డుల్లో కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ఖాన్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు ఎజాజొద్దీన్, పోతన్న యాదవ్, సాయినాథ్, రువ్వి బాబు, ఇమ్రాన్ ఉన్నారు.
కుభీర్, నవంబర్ 25 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సంజయ్ చౌహాన్, బీఆర్ఎస్ నాయ కులు గిరిజన తండాలు, గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కుబీర్తో పాటు, పల్సి, చొండి, గోడ్సర, సాంగ్వి, మాలేగాంలో సర్పంచ్ మహిపాల్రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు సాయి ప్రసాద్రెడ్డి, సిర్పెల్లి తండాలో శ్యాంరావు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. గంగారావు, రాములు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.