ఇంద్రవెల్లి, డిసెంబర్ 7: మండల కేంద్రంలో దత్త జయంతి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజన సంకీర్తనలతో పల్లకీ ఊరేగింపును ప్రధాన వీధులగుండా నిర్వహించారు. ముందుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దేవతలను భక్తులు దర్శించుకున్నారు.
దత్త జయంతి సందర్భంగా భీంపూర్, కరంజి(టీ), గోముత్రి, గుబ్డి, అంతర్గాం, అర్లి(టీ), తాంసి(కే) గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహా నైవేద్యం వితరణ చేశారు. మహారాష్ట్ర మాహోర్కు వెళ్లి దత్తగురువును దర్శించుకున్నారు. కరంజి(టీ)లో దత్త భక్తులు సిల్వర్ ఆశన్న, జక్కు పంజాబ్రెడ్డి, మేకల బాపు, బక్కి బాపు, అర్పెల్లి కిష్టన్న, ఆకటి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం రాంనగర్లోని దత్త మందిరంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరయ్యారు. ఉదయం అభిషేకం, యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.