దండేపల్లి, మార్చి4 : మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్తో పాటు పలువురు దాతలు స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడు వెంకటరమణ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అభిజిత్కు అండగా ఉంటానని, హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లతో మాట్లాడుతానని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ రీట్వీట్ చేశారు. అలాగే దాతల నుంచి ఇప్పటి వరకు రూ.1,12,684 అందినట్లు అభిజిత్ తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.