కోటపల్లి, డిసెంబర్ 21 : జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్నవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి సత్యనారాయణ సూచించారు. గురువారం కోటపల్లి పీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్ జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కరోనా కొత్త వేరియంట్ వస్తుండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని, రద్దీగల ప్రదేశాలకు వెళ్లకూడదని వైద్యాధికారి సూచించారు.