మంచిర్యాల ఏసీసీ, మే 23 : లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లపాటు జైలు శిక్ష విధించబడుతుందని మంచిర్యాల జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.అనిత అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 సానింగ్ కేంద్రాలు ఉన్నాయని, లింగ నిర్ధారణ చేయరాదంటూ పోస్టర్లు అతికించాలని, వారి సర్టిఫికెట్లను ప్రదర్శించాలని, సానింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఫొటోలు పెట్టరాదని ఆదేశించారు. అనంతరం 12 దవాఖానల రెన్యువల్ కోసం, రెండు సానింగ్ సెంటర్ల మంజూరు కోసం పై అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ డా.నీరజ, ఎన్జీవోలు డా.రాధిక, డా.కోటేశ్వరరావు, డా.సుధాకర్, డా.రాజ్ కిరణ్, డెమో బుక వెంకటేశ్వర్ పాల్గొన్నారు.