మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 13 : గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యసేవలు అం దిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హె చ్చరించారు. శనివారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించే కేంద్రాలకు ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు పెట్టుకోవాలని, అందులో ఎలాంటి బెడ్స్ ఉం డకూడదని, ఎలాంటి శాంపిల్స్ మందులు ఉండరాదని, యాంటీబయోటిక్స్ మందులు ఎట్టిపరిస్థితుల్లో వాడరాదన్నారు.
ప్రజలు అత్యవసర సేవలకు 108 అంబులెన్స్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రోగులను ప్రభుత్వ దవాఖానలకు పంపంచాలేగానీ.. ప్రైవేట్ హాస్పిటల్స్తో సంబంధాలు ఏర్పర్చుకోవద్దని సూచించారు. ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, ఎలాంటి సమస్యలున్నా డీఎంహెచ్వో దృష్టికి తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వెల్ఫేర్ సభ్యులు పాల్గొన్నారు.