మంచిర్యాల ఏసీసీ, జనవరి 17: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణ శాఖాధికారి లెక్కల కిష్టయ్య సూచించారు. మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలు నెల రోజుల పాటు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.
ఈ నెల 15 నుంచి వచ్చేనెల 14 వరకు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. బైక్ నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు నడుపకూడదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని కోరారు. ఈ నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయని పేర్కొన్నారు.