మంచిర్యాల ఏసీసీ, జనవరి 29 : కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.జీ.సుబ్బారాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో పోస్టర్లను విడుదల చేశారు.
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్ల ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా.నీరజ, డా.అనిత, డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.