ఎదులాపురం, ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆదిలాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, నోడల్ అధికారి ఫణిందర్, మెప్మా పీడీ రాజు ఉన్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటెషన్ కేంద్రం, ఎన్నికల ప్రచార వాహనాల అనుమతి కేంద్రాల్లో ఏర్పాట్లు, రిజిస్టర్లను పరిశీలిం కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్రావ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి జరగనున్న రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో గురువారం జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. మాస్టర్ ట్రెయినర్ లక్ష్మణ్ ఎన్నికల నియమావళి, ఈవీఎంల నిర్వహణ, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనుమంతు నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి.రాజు పాల్గొన్నారు.