వేమనపల్లి, జనవరి 20 : విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ విద్యాలయం, జడ్పీ హైస్కూల్ను ఆయన పరిశీలించారు. చదువుతోనే భవిష్యత్ బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో బాపురావు, సర్పంచు గాలి మధు, ఎంఈవో తిరుపతిరెడ్డి, వైద్యాధికారి రాజేశ్, ఏపీవో సత్యప్రసాద్, వెటర్నరీ వైద్యురాలు అరుణ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సువర్ణ, నీల్వాయి హెచ్ఎం గిరిధర్ రెడ్డి, కస్తూర్బా ప్రిన్సిపాల్ మయూరి, పంచాయతీ కార్యదర్శులు అశోక్ పాల్గొన్నారు.