సిర్పూర్(టీ), జనవరి 31: సిర్పూర్(టీ) మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ విస్తృతంగా పర్యటించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టీ) సామాజిక దవాఖాన, జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
సిబ్బంది పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో రికార్డులను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న వివరాలపై ఆరా తీశారు. సిర్పూర్(టీ) సామాజిక వైద్యుడు చెన్నకేశవ, జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.