నిర్మల్ అర్బన్, జూన్ 20 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవా రం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక మంజులాపూర్ ఉన్నత పాఠశాల, శాంతినగర్ గురుకుల పాఠశాల, శాంతినగర్ అర్బన్ కేజీబీవీ, జుమ్మెరాత్పేట్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు అన్ని పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. వ్యాసరచన, ఉన్యాస పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతు లు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు సిద్ద పద్మ, కౌన్సిలర్ నర్సవ్వ సాయన్న, నీరడి గంగాశంకర్, సుజాత, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బాలికల పాఠశాలలో..
నిర్మల్ టౌన్, జూన్ 20 : నిర్మల్లోని బాలికల పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని జరుపుకు న్నా రు. సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. తొమ్మి దేళ్ల తెలంగాణలో సాధించిన ప్రగతిని విద్యార్థులకు చదివి వినిపించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. ఈద్గాం అశ్రమ గిరిజన పాఠశాల, సోఫీనగర్ గురుకులం, కేజీబీవీ అర్బన్ తదితర పాఠశాలో విద్యా దినోత్స వాన్ని నిర్వహించారు. ఉత్తమ విద్యార్థులను ఘనంగా సన్మానం చేశారు. హెచ్ఎంపలు జాఫర్, గంగాశంకర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
సోన్లో..
సోన్, జూన్ 20 : సోన్ కేజీబీవీలో జరిగిన కార్యక్రమానికి జడ్పీటీసీ జీవన్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి భోజనం, పుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను అందించి అత్యు త్తమ విద్యను అందిస్తున్నదని పేర్కొన్నారు. అనం తరం పదో తరగతిలో పది జీపీఏ సాధించిన ఆరు గురు విద్యార్థుల ను సన్మానించారు. ఎంపీపీ బర్ల మానస హరీశ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, ఎస్వో లత పాల్గొన్నారు. కాగా నిర్మల్, సోన్ మండలాల్లోని ఆయా ప్రాథమిక, ఉన్నత పాఠ శాలల్లో విద్యా దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోన్, న్యూవెల్మల్ బొప్పారం, పాక్పట్ల, కడ్తాల్, మాదా పూర్, సాకెర, గంజాల్, సిద్ధులకుంట నిర్మల్ మండలం వెంగ్వాపేట్, అక్కాపూర్, డ్యాంగా పూ ర్, చిట్యాల్, నీలాయిపేట్, ముజ్గి, కౌట్ల, తాంశ, తల్వేద, రత్నాపూర్కాండ్లీతోపాటు తదితర పాఠశాలల్లో జెండాను ఆవిష్కరించారు. విద్యార్థు లతో ర్యాలీ నిర్వహించి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మా నించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాందలో..
లక్ష్మణచాంద, జూన్ 20 : మండలంలో విద్యాదినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అనంత రం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. విద్యాభివృద్దికోసం ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు వివరిం చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజే శ్వర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సర్కారు బడుల్లో అత్యుత్తమ విద్య
దిలావర్పూర్ జూన్ 20 : సర్కారు బడుల్లో అత్యుత్తమ విద్యతో పాటు చక్కని వసతులు కల్పిస్తున్నారని మండల విద్యాధికారి శంకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గుండంపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కునే పేద విద్యార్థులకు కార్పొరేట్స్థాయి విద్యతో పాటు సకల వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని పేర్కొ న్నారు. విద్యార్థులు అవకాశాలను వినియోగించు కోవాలని కోరారు. మాజీ ఎంపీపీ అమృత, ఉపాధ్యాయులు రమదేవి, విజయ్కుమార్, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు ఏలాల చిన్నారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.
నర్సాపూర్(జీ)లో..
నర్సాపూర్(జీ), జూన్ 20 : ఆయా గ్రామాల్లో విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు.మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జడ్పీటీసీ చిన్న రామయ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్సీసీ విద్యార్థ్తులతో ర్యాలీ నిర్వహిం చారు. విద్య వల్ల ప్రతి విద్యార్థి వికాసం చెందు తాడని ప్రధానోపాధ్యాయుడు కిషన్ రావు పేర్కొ న్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొండ్ర రమేశ్, గోపిడి గంగారెడ్డి, జుబేర్, సాగర్, మహేందర్, ఉపాద్యాయులు భూమేశ్, పూర్ణ చందర్, మోహ న్ రావ్, ఎస్వో సునీత, సమత, మైస విజయ్, తదితరులు పాల్గొన్నారు.