ఇంద్రవెల్లి, ఏప్రిల్ 9: బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. ఆదివాసీ గిరిజనులు చైత్రమాసాన్ని పురస్కరించుకొని అక్కడ వండుతున్న నైవేద్యాలతోపాటు సామూహిక వంటలను సందర్శించి, స్వయంగా వంటలు చేశారు. అక్కడి నుంచి మం డలంలోని వడగాం గ్రామపంచాయతీ పరిధిలోని జెండాగూడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామాల మధ్యలోని వాగువద్ద కల్వర్టు నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వడగాం నుంచి జెండాగూడ గ్రామం వరకు రూ. 39 లక్షలతో రోడ్డు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంతోపాటు గ్రామం అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చే సి అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నా రు. ఖానాపూర్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మం జూరులో ఉన్నాయని, ప్రతి గ్రామంలోని పేదలకు ఈ ఇండ్లు అందజేస్తామన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
వడగాం గ్రామపంచాయతీ పరిధిలోని జెండాగూడ గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యే రేఖానాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఆమె పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. గ్రామస్తులు విన్నవించిన సమస్యలను దశాల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. గ్రామానికి ఆశ కార్యకర్తలను నియమించాలని కలెక్టర్కు ఫోన్లో విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ అంజద్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, సర్పంచ్లు కో రెంగా గాంధారి, ఆత్రం రత్తుబాయి, రాథోడ్ శారద, ఆడె విజయ, పార్వతీబాయి, జాదవ్ లఖన్సింగ్, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, రైతు బంధు సమితి అధ్యక్షుడు తొడసం హరిదాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దే వ్పూజె మారుతి, ధర్ము, రాథోడ్ వసంత్రావ్, రాందాస్, రాంనివాస్, సుంకట్రావ్, గ్రామస్తులు గోవింద్రావ్పటేల్, గ్రామస్తులు భగవంత్, బాపురావ్, జంగుబాపు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 9: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. సుర్జాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన రాకేశ్ పాడిన జై భీం పాటను ఆదివారం తన నివాసంలో విడుదల చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పాట పాడిన బృందాన్ని ఆమె అభినందించారు. అంబేద్కర్ ఆదర్శనీయుడని, ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని గుర్తు చేశారు. మండలంలో ని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చె క్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేందర్, నాయకులు రాజగంగన్న, రామునాయక్, గోవింద్, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.