రెబ్బన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ( Ambali Centre ) ప్రారంభించారు. రెబ్బన తహసీల్దార్ సూర్య ప్రకాష్, ఎస్సై వెంకట కృష్ణ అంబలి పంపిణీ ని ప్రారంభించారు.
గత 8 సంవత్సరాలుగా దేవాల వినోద్ స్వామి నిస్వార్ధంగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి ఏటా వేసవిలో మూడు నెలలు అంబలి పంపిణీ చెయ్యడం అభిందనీయమని పేర్కొన్నారు . వివిధ పార్టీలకు చెందిన నాయకులు దేవార వినోద్ స్వామిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బన ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.