కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. తాజాగా 55 మందితో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిం చడంతో ‘హస్త’వ్యస్తంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, బెల్లంపల్లిలో సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. తమకే టికెట్ వస్తోందని ఆశించిన నాయకుల ఆశలు అడియాశలు అయ్యాయి. మంచిర్యాలలో ప్రేంసాగర్రావు వర్గానికి, సీనియర్ నాయకులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా పీఎస్ఆర్, గడ్డం వినోద్ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టికెట్ రాని నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలతో టచ్లో ఉంటూ టికెట్ ఆశిస్తున్నారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తుండడంతో ఎన్నికల్లో కష్టాలు తప్పవనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది.
– మంచిర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. మంచిర్యాల, బె ల్లంపల్లిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పలువురు నాయకులు తలనొప్పిగా మారారు. మంచిర్యాల అభ్యర్థి ప్రేమ్సాగర్తోపాటు బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలకంఠేశ్వర్గౌడ్, పార్టీలో సీనియర్గా ఉంటూ వస్తున్న కేవీ ప్రతాప్, లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య వీరంతా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముందు నుంచి రేవంత్రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఆయన వర్గంగా మంచిర్యాలలో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వారిని కాదని భట్టి విక్రమార్క వ ర్గానికి చెందిన పీఎస్ఆర్కు టికెట్ రావడంతో మిగిలిన నాయకులు గుర్రుగా ఉన్నారు.
టికెట్ ప్రకటించడానికి రెండు, మూడు రోజుల ముందే కేవీ ప్రతా ప్, అంతకు ముందే ముత్తె సత్తయ్య పీఎస్ఆర్కు వ్యతిరేకంగా కార్యకర్తలు, సన్నిహితులతో ఎవరికి వారు సమావేశాలు నిర్వహించారు. తమను కాదని పీఎస్ఆర్కు టికెట్ ఇస్తే సహాయ నిరాకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసిం ది. అదే జరిగితే సొంత పార్టీలోని కీలక నాయకుల నుంచే పీఎస్ఆర్కు ఎదురుదెబ్బ తగలనుంది. పైగా ఇప్పటికే రేవంత్రెడ్డి అంటే పీఎస్ఆర్కు పడదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ అభిమాన వర్గం పీఎస్ఆర్కు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తున్నది.
బెల్లంపల్లిలో పెద్ద తలల కొట్లాట..
బెల్లంపల్లిలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్కు మంచిర్యాల అభ్యర్థి ప్రేమ్సాగర్రావుకు పడడం లేదు. ఈ మధ్యే పీఎస్ఆర్ తనకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని గడ్డం వినోద్ రూ.25 లక్షలకు చెక్ బౌన్స్ కేసు వేశారు. లీగల్ నోటీసులు పంపించారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గడ్డం వినోద్ను కాదని పీఎస్ఆర్ ముందు నుంచి బెల్లంపల్లిలో తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. నాతరి స్వామి, చిలుముల శంకర్, రోడ్డ శారద, ముడిమడుగుల మహేందర్ వీరంతా పీఎస్ఆర్ మనుషులుగా జనంలోకి వెళ్లారు. కొన్ని నెలల క్రితం నాతర స్వామి కాంగ్రెస్ అభ్యర్థి అం టూ విస్తృతమైన ప్రచారం జరిగింది. భట్టి పాదయాత్రతో ఇక ఫైనల్ అయిపోయినట్లే అని చెప్పారు. నాన్లోకల్లో ఉండే వినోద్కు బదులు ఈయనకు టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. తీరా ఇప్పుడు అధిష్టానం గడ్డం వినోద్కు టికెట్ ఇవ్వడంతో పీఎస్ఆర్ వర్గం అట్టుడికిపోతోంది. వినోద్కు మద్ద తు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పీఎస్ఆర్ వర్గంలో ము ఖ్యమైన వారంతా బెల్లంపల్లి టౌన్కు చెందిన వా రే కావడంతో గడ్డం వినోద్కు కాస్తో, కూస్తో పట్టున్న బె ల్లంపల్లి లోనూ ప్రభా వం కో ల్పోయే దుస్థితి నెలకొంది.
ఆశావహుల పక్కచూపులు..
మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన నాయకులు ఇప్పుడు పార్టీ కోసం పని చేసే ఉద్దేశంతో లేన్నట్లు కనిపిస్తోంది. మంచిర్యాలకు చెందిన కొందరు నా యకులు వేరే పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నా రు. ఏ పార్టీ లేకపోతే ఏదో గుర్తుపై పోటీ చేయాలని చూస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కీలక నేత ఒకరు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరొకరు వేరే పార్టీతో టచ్లోకి వెళ్లారు. బీసీ నినాదంతో పార్టీలోకి వచ్చిన నాయకుడు బీసీ లు అం దరూ కలిసి పార్టీలకు అతీతంగా పోటీ చేస్తే తానే అభ్యర్థి అవ్వాలని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రూపు రాజకీయాల తో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు తల లు పట్టుకుంటున్నారు. బెల్లంపల్లిలో పీఎస్ఆర్ వర్గీయులు స్వతంత్రంగా లేదా టికెట్ వచ్చిన పార్టీలోకి వెళ్లి పోటీ చే యాలని చూస్తోంది. పొత్తుల్లో భా గంగా చెన్నూర్ టికెట్ సీపీఐకి ఇస్తారనే ప్రచారం జ రుగుతుండడం తో ముందు నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోటీలో ఉంటామని ఒకరిద్దరు ఇప్పటికే లీక్లు ఇస్తున్నారు. సొంత పార్టీ నేతలే తి రుగుబాటు చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవనే గుసగుసలు వినిపిస్తున్నాయి.