ఆసిఫాబాద్,ఆగస్టు 18 : టీఎస్ఆర్టీసీలో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్లే మూడు సర్వీసుల్లో ఈ సేవలను గురువారం నుంచి ప్రారంభించినట్లు ఆసిఫాబాద్ డీఎం సుగుణాకర్ తెలిపారు.
డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తారని చెప్పారు. డిపోకు 16 ఐ టిమ్స్(ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూ మిషన్లు) మంజూరైనట్లు తెలిపారు. ఇంటర్నెట్ సహకారంతో డ్రైవర్లు వీటిని వాడుతారని, వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.