రెబ్బెన : సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. బొగ్గు గనులను అమ్మడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకొవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి జీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏరియా ఎస్ వో టు జీఎం కృష్ణరావు, పీఎం లక్ష్మణ్రావు లకు వినతిపత్రం అందజేశారు. లాభాల్లో ఉన్న గనులను ప్రైవేట్పరం చేయడం దారుణమని నాయకులు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, గెల్లి రాయలింగు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధారవత్ మంగిలాల్, పిట్ కార్యదర్శులు కార్నాథం వెంకటేశం, మెరుగు రమేశ్, జీఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సమ్మయ్య, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, ఏరియా నాయకులు పాల్గొన్నారు.