వాంకిడి,జనవరి 21 : వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని సరేపల్లిలో పులి దాడిలో మృతి చెందిన పశువులకు సంబంధించిన పరిహారం చెకులను ఎంపీపీ విమలాబాయితో కలసి బాధితులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పులి దాడిలో పశువులు చనిపోతే పరిహారం అందిస్తామన్నారు. అడవి పందుల బెడదతో పంటలు నష్టపోతున్నాయంటూ పలువురు రైతులు, గ్రామస్తులు డీఎఫ్వో దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సర్కేపల్లిలోని పిల్లలకు స్కూల్ బ్యాగులు, పెన్నులు, నోటుబుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీరేంజ్ అధికారి అప్పలకొండ, వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్, డీవైఆర్వో సరోజారాణి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, అటవీ సెక్షన్, బీట్ అధికారులు, బీఆర్ఎస్ మండల యువనాయకుడు దీపక్ ముండే, సర్పంచ్ నీలబాయి, మనోహర్ ఉన్నారు.