బెల్లంపల్లి, జనవరి 21 : పట్టణంలో ఆదివారం వన దేవతలైన సమ్మక్క-సారలమ్మకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే నెలలో మేడారంలో జరిగే మహాజాతరను పురస్కరించుకుని స్థానికంగా నిలువెత్తు బంగారంతో పూజలు చేశారు.
అనంతరం స్థానికులకు పంపిణీ చేశారు. బజార్ఏరియా, పాత బస్టాండ్ ఏరియాల్లోని కిరాణాషాపులు భక్తులతో సందడిగా కనిపించాయి.