బాసర, జనవరి 1 : నూతన సంవత్సరం తొలిరోజు, సెలవు దినం కావడంతో భక్తులు బాసరకు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. అమ్మవారిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు.