ఎదులాపురం, డిసెంబర్ 9 : దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సంతకం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ తీసి పటాకులు కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయకచౌక్లో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు సయ్యద్ సాజీద్ ఉద్దీన్, మహిళా పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూప, మమత, కౌన్సిలర్ అశోక్ స్వామి, సంద నర్సింగ్, వెంకన్న, ఎంపీపీ గంగాధర్, ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు మోబిన్, రామ్ కుమార్, రమణ, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యం
నేరడిగొండ, డిసెంబర్ 9 : దేశంలో భారత రాష్ట్ర సమితితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బీఆర్ఎస్గాఆవిర్భవించిన సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మార్పు రావాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా నాయకుడు కుంట కిరణ్కుమార్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో…
ఎదులాపురం, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా అమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లోమున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా పవన్రావు ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ జంగు పటేల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్లో…
బోథ్, డిసెంబర్ 9: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, సర్పంచ్ సురేందర్యాదవ్, సుభాష్, రమణాగౌడ్, నరేందర్, నారాయణరెడ్డి, సత్యనారాయణ, బుచ్చన్న, రఫీ, గంగాధర్, స్వామి, దేవీదాస్, నర్సయ్య, రాయలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ముక్రా(కే)లో..
ఇచ్చోడ, డిసెంబర్ 9 : టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో శుక్రవారం నాయకులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించడంతో ముక్రా(కే) గ్రామంలో ఆయన చిత్ర పటాలతో బీఆర్ఎస్ పేరుతో దేశ్కీ నేత కేసీఆర్ అంటూ, కేసీఆర్ ప్రధాని కావాలని యువకులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, డిసెంబర్ 9 : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై కేసీఆర్.. జై రాథోడ్ బాపురావ్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, రాంచందర్, దుర్వ పటేల్, రాజు, భూతి, ఎస్సీ సెల్ కన్వీనర్ గణేశ్, ఎస్టీ సెల్ కన్వీనర్ రాథోడ్ ప్రవీణ్, గంగారాం, గోవింద్, మడావి భీంరావ్, శంకర్ పాల్గొన్నారు.
భీంపూర్, డిసెంబర్ 9 : టీఆర్ఎస్ను ఎన్నికల సంఘం బీఆర్ఎస్గా గుర్తించడంపై భీంపూర్ మండలంలోని గ్రామాల్లో సర్పంచ్లు ,ఎంపీపీ రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, పార్టీ మండల కన్వీనర్ మేకల నాగయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ , కల్యాణ లక్ష్మి, తదిదర సంక్షేమ పథకాలు సహా మిషన్ భగీరథ, కాకతీయ లాంటి శాశ్వత అభివృద్ధి పనుల కోసం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు.
నార్నూర్లో..
నార్నూర్, డిసెంబర్ 9 : మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఆసిఫాబాద్ నియోజకం వర్గ ఇన్చార్జి కొరల మహేందర్, మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ఖాసీం, పట్టణాధ్యక్షుడు ఫేరోజ్ఖాన్, ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, నాయకులు షేక్ హైమద్, జాదవ్ అజయ్, రాము, గోపాల్, భీంరావ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
గుడిహత్నూర్, డిసెంబర్ 9 : మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి జెండాను పార్టీ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా అమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో మండల నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ జంగు, నాయకులు సోంబాయి, వినోద్, భీంరావ్, సంతోష్గౌడ్, జలంధర్, రాందాస్, ఆశన్న యాదవ్, శ్రీకర్గౌడ్, రాకేశ్ పాల్గొన్నారు.