జైపూర్, ఏప్రిల్ 11 : సెల్ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలం వేలాలలో గురువారం జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన కథనం ప్రకారం.. వేలాల గ్రామానికి చెందిన ప్యాగ స్వామి, సమ్మక్క దంపతుల కుమార్తె సాయిసుమ (18) మంచిర్యాలలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది.
తన సెల్ఫోన్ పగిలిపోయిందని, మరో సెల్ఫోన్ కొనివ్వాలని తల్లితో గొడవ పడింది. పత్తి అమ్మిన తర్వాత కొనిస్తామని చెప్పిన సమ్మక్క.. భర్త స్వామితో కలిసి పొలం పనులకు వెళ్లిపోయింది. వీరి కుమారుడు ఇంటి తలుపులు వేసి ఉండడంతో కిటికిలోంచి చూడగా సాయిసుమ ఉరి తాడుకు వేళాడుతూ నిర్జీవంగా కనిపించింది. వెంటనే తల్లితండ్రులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.