నిర్మల్ అర్బన్, అక్టోబర్ 25 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చలి ప్రారంభమైంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చలి తీవ్రత పెరుగుతున్నది. కనిష్ఠంగా 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో 13.4, నిర్మల్లో 13.8, మంచిర్యాలలో 13.4, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 12.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న డిసెంబర్, జనవరి మాసాల్లో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఉద యం, సాయంత్రం చలి తీవ్రత అధికంగా ఉం టుండగా.. మధ్యాహ్నం ఎండ వేడిమి ఉంటున్నది. సహ్యాద్రి పర్వత శ్రేణులు, అడవులు అధికంగా ఉండడం చలి తీవ్రతకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. యేటా ఉమ్మడి జిల్లాలోనే కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. ప్రజలు చలి నుంచి కాపాడుకునేందుకు వెచ్చని దుస్తులు ధరించడం, చలి మంటలు కాగడం చేస్తూ రక్షణ పొందుతున్నారు. స్వెట్టర్లు, బ్లాంకి ట్లు, మఫ్లర్లకు డిమాండ్ ఉండడంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు వె చ్చని దుస్తులు విక్రయిస్తున్నారు. పనులకు వెళ్లే కూలీలు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు వా హనాలకు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు..
చలి ప్రభావం వల్ల చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోస సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే చర్మం కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. వేడి ఆహారాన్ని, గోరు వెచ్చటి నీటిని తాగాలి. చర్మం పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన వ్యాసిలెన్, మాశ్చరైజర్లు రాసుకోవాలి. వాకింగ్కు వెళ్లే వారు ఉదయాన్నే కాకుండా సూర్యోదయం వేళ వెళ్తే చర్మ సమస్యలు తలెత్తవు.