నిర్మల్ టౌన్, మే 29: వచ్చే నెల 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించన్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్లో కలెక్టర్ వరుణ్రెడ్డి ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి సమీక్ష జరిపారు. రాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్ల ప్రగతి, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. జూన్ 2 న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, 4న సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖాశ్యాంనాయక్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ ప్రవీణ్కుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పెండింగ్ పనులు పూర్తి చేసి భవనాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని కోరారు.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో రాష్ట్ర అవతరన దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది వేడుకల నిర్వహణపై కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్తో కలిసి సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, 101 రైతు వేదికలు, సబ్ స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, డీఎఫ్వో రాజశేఖర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్లు పీ శ్రీజ, వికాస్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, ఆర్డీవోలు రమేశ్, సురేశ్, అధికారులు పాల్గొన్నారు.