భీంపూర్, ఫిబ్రవరి 2 : బీఆర్ఎస్ పార్టీ తోనే దేశ ప్రగతి సాధ్యమని ఆదిలాలబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు అమలుచేస్తూ యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ భీంపూర్ మండల కన్వీనర్ మేకల నాగయ్యతో కలిసి గురువారం మహారాష్ట్రలోని ఘాటంజిని సందర్శించారు. అక్కడ రైతులు, కూలీలు, యువతతో మాట్లాడారు. ఈ నెల 5న నాందేడ్లో నిర్వహించే బహిరంగ సభకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తప్పుడు విధానాలతో దేశం తిరోగమనంలో ఉందన్నారు. తాజా బడ్జెట్తో సామాన్యుడికి ఏమాత్రం ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఘాటంజిలో వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపారు. ఆయన వెట మహారాష్ట్ర నాయకులు నార్లావార్ నితిన్యాదవ్, అంబెపు రమేశ్, అంబెపు నారాయణ, శంకర్, వివిధ గ్రామాల రైతులు ఉన్నారు.