రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించింది. దస్తురాబాద్ మండలంలో 12,002 మంది ఓటర్లుండగా, అత్యధికంగా మండల కేంద్రంలో 2,421, అత్యల్పంగా ఎర్రగుంట గ్రామంలో 235 మంది ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నది. కాగా మార్పులు, చేర్పులతో పాటు, కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నది.
దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం బూత్ లెవల్ అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. మండలంలో మొత్తం 12,002 మంది ఓటర్లున్నారు. మండలంలో పురుషల కంటే 282 మంది మహిళా ఓటర్ల్లు అధికంగా ఉన్నారు.
12,002 మంది ఓటర్లు ..
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో దస్తురాబాద్ మండలం వ్యాప్తంగా 12,002 మంది ఓటర్లు ఉన్నారు. అందులో దస్తురాబాద్లో 2,421(పురుషులు 1250, స్త్రీలు 1171), మున్యాలలో 1,790 (పురుషులు 919, స్త్రీలు 871), గొడిసేర్యాలలో 1218 (పురుషులు 604, స్త్రీలు 614), రేవోజీపేటలో 1330 (పురుషులు 713, స్త్రీలు 617), దేవునిగూడెంలో 590 (పురుషులు 289, స్త్రీలు 301), భూత్కూర్లో 1050 (పురుషులు 507, స్త్రీలు 543), పెర్కపల్లెలో 522 (పురుషులు 257, స్త్రీలు 265), ఎర్రగుంటలో 235 (పురుషులు 121, స్త్రీలు 114), మున్యాల తండాలో 416 (పురుషులు 215, స్త్రీలు 201), గొడిసేర్యాల గోండుగూడెంలో 258 (పురుషులు 123, స్త్రీలు 135), బుట్టాపూర్లో 1172 (పురుషులు 574, స్త్రీలు 598), చెన్నూర్లో 456 (పురుషులు 224, స్త్రీలు 232), మల్లాపూర్ 544 (పురుషులు 277, స్త్రీలు 267) మంది ఉన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు..
ఈ ముసాయిదా జాబితాపై డిసెంబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అలాగే కొత్తగా ఓటరు నమోదు కోసం గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పేర్లలో గానీ, అడ్రస్లో గానీ తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో మండలంలోని ప్రతీ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నారు. ఓటరు నమోదు ఫారాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఓటరు నమోదుకు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు సైతం చేసుకోవచ్చు.
పంచాయతీల్లో ఓటరు జాబితా..
ఓటరు జాబిత లిస్టును బీఎల్వోలకు అందజేసి, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాం. ఓటర్లు తమ పేర్లను చూసుకోవాలి. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో ఆయా బూత్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నాం. మార్పులు, చేర్పులు ఉంటే.., కొత్తగా ఓటరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువజన సంఘాలు, యువకులు సహకరించి, విజయవంతం చేయాలి.
– జీ లక్ష్మి, తహసీల్దార్, దస్తురాబాద్