ఎదులాపురం, జనవరి 12: మావల గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎంబడి వంశీ పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి సభ్యులు జిల్లా ఎస్పీ గౌస్ అలంను కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధితులకు రక్షణ కల్పించాలని, తక్షణమే ప్రభుత్వం నుంచి ఆర్థిక పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతకుముందు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, బాధితులకు రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సమితి జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న, వర్కింగ్ ప్రెసిండెంట్ ఎన్. నవీన్, నాయకులు నల్ల రాజేశ్వర్, శశికాంత్, నిమ్మల ప్రశాంత్, తుల్జాపూరే శోభ, సత్యనారాయణ, ఈర్ల దయాకర్, సందీప్, అనిల్, వెంబడి స్వామి, మధుకర్, కృష్ణ, తదితరులున్నారు.