మందమర్రి, జూన్ 20 : సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి యాజమాన్యం కృషి చేయాలని, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్జీవోలు అభిప్రాయపడ్డారు. మందమర్రి పట్టణంలోని సీఐఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఏరియాలోని కేకే ఐదు గని విస్తరణ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కేకే ఐదు గని విస్తరణకు తాము సానుకూలంగానే ఉన్నామని, కానీ సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహు ల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోర్డ్ ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. మండల పరిధిలో సింగరేణి ప్రభావిత గ్రామాలైన సారంగపల్లి, శంకర్పల్లి, సండ్రోన్పల్లి, తుర్కపల్లి గ్రా మాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.
గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర వసతుల కల్పనతో పాటు ప్రతి నెలా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. సింగరేణి కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తూనే దవాఖాన నిర్మించాలని కోరారు. కేకే ఐదు గని ప్రధానంగా శంకర్పల్లిపై ప్రభావం చూపుతుందని, ఆ గ్రామానికి గని నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మించాలని కోరారు. గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఏ రియా జీఎం జీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణలో వక్తలు వెల్లడించిన అంశాల్లోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపా రు. తెలంగాణ పొల్యూషన్ కం ట్రోల్ బోర్డ్ నిజామాబాద్ ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ మాట్లాడు తూ.. ఇందులో 21 మంది అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. ఆ అభిప్రాయాలు, సలహాలను కేంద్ర ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి పంపించనున్నట్లు పేర్కొన్నారు.