చెన్నూర్, జనవరి 11 : పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరమల్ల మురళీమోహన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. మొత్తం 19 జట్లు పాల్గొనగా నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఫైనల్లో రుద్ర-11, ఫ్రెండ్స్-11 జట్లు హోరాహోరీగా తలపడగా, రుద్ర-11జట్టు గెలుపొందింది.
ఫ్రెండ్-11 జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, బీఆర్ఎస్ నాయకుడు రాంలాల్ గిల్డాలు షీల్డ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు వీరమల్ల రాము, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానికరౌతు శంకర్ పాల్గొన్నారు.