నేరడిగొండ, జనవరి 20 : ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని డీఎల్పీవో ధర్మారాణి అన్నారు. మండల కేంద్రంలోని పలు వాణిజ్య, వ్యాపార సంస్థలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడారు. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క రూ మాస్కు ధరించాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ భవన నిర్మాణ కార్మికులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె వెంట ఎంపీవో శోభన, సర్పంచ్ పెంట వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు.
ఉట్నూర్, జనవరి 20 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డీఎల్పీవో భిక్షపతి గౌడ్, జీపీ ప్రత్యేక అధికారి మహేశ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పంచాయతీ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. వ్యాపారులు తమ షాపుల ముందు క్యూ లైన్ కోసం మార్కింగ్ వేయాలని సూచించారు. ఈవో సత్యనారాయణ, జీపీ సిబ్బంది ఉన్నారు.
బేల, జనవరి 20 : మండల ప్రత్యేకాధికారి,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, బేల సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, వైద్యాధికారి క్రాంతి కుమార్ తదితరులు మండల కేంద్రం లో పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఓ ఆటోలో మైక్ ద్వారా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, ఎంపీవో సుమీర్ హైమద్, పంచాయతీ కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జనవరి 20: ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద(టీ), లాండసాంగ్వి పంచాయతీలను ఎంపీవో ఆనంద్ గురువారం సందర్శించారు. వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సర్పంచ్లు భాస్కర్,సువర్ణ, ఎంపీటీసీ శ్రీనివాస్, కార్యదర్శులు రాఖీ,సుల్తానా ఉన్నారు.
బోథ్, జనవరి 20: కరోనా వైరస్పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోథ్ ఎంపీవో జీవన్రెడ్డి, సర్పంచ్ జీ సురేందర్యాదవ్ సూచించారు. మండల కేంద్రంలో గురువారం పర్యటించారు. నో మాస్క్… నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యాపారులకు సూచించారు. మాస్కులు లేకుండా వచ్చే వారికి సరుకులు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కే పల్లవి, డాక్టర్ ఆర్ రవీంద్రప్రసాద్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, వీడీసీ చైర్మన్ జీ గంగాధర్, డీ నారాయణరెడ్డి, ఈవో అంజయ్య, గౌరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 20 : ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనీ ఎంపీవో కొమ్ము రమేశ్ అన్నారు. స్థానిక పోలీసులతో కలిసి ఇచ్చోడలోని వ్యాపారులకు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాశ్, కానిస్టేబుళ్లు సదాశివ్, కుర్మే మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
నార్నూర్,జనవరి 20 : మండల కేంద్రంలోని ఖాందేవ్ జాతరలో ఎస్ఐ పవర్ గౌతమ్, ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనపై మైక్ ద్వారా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేశారు. మాస్క్ లేకుండా బయటికి వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీవో స్వప్నశీల సూచించారు. వారి వెంట సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్,ఆలయ కమిటీ బాధ్యులు తొడసం నాగోరావ్, మహేందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గాదిగూడ మార్కెట్లో కొవిడ్ నిబంధనలపై ఎంపీవో సాయిప్రసాద్ విస్తృత ప్రచారం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల ని, శానిటైజర్ అందుబాటులో పెట్టుకోవాలన్నారు. కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యాపారస్తులకు,ప్రజలకు సూచించారు.