ఆసిఫాబాద్ : అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. అదనపు కలెక్టర్ రాజేశం వాంకిడి మండలంలోని పత్తి కొనుగోలు వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని భాగ్యనగర్ కాలనీ ఆదిలాబాద్ క్రాస్ రోడ్డు వద్ద అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి వ్యాపారులు మార్కెట్ కమిటీ లైసెన్స్ తీసుకోవడంతో పాటు కాంటా దృవీకరణ, జీఎస్టీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ బిల్ బుక్, ఖాతా రిజిస్టర్ తప్పని సరిగా ఉండాలన్నారు.
అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యదర్శి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా తదితరులున్నారు.