దిలావర్పూర్ ఏప్రిల్ 15 : పత్తి ధర పెరుగు తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవు తున్న ది. పత్తి పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పట్లో విక్రయించ లేదు. పత్తి ధర రోజుకింత పెరుగుతుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పంట చేతి కి వచ్చిన సమయంలో వెంటనే విక్రయిస్తే మంచి తూకం వచ్చేది. కానీ ఇన్ని రోజులుగా ఇండ్లు, పంట చేన్లల్లో మండెలు నిల్వ ఉంచడంతో తూకం తగ్గుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కదిలి, మాడెగాం, గుండం పల్ల్లి, దిలావర్పూర్ గ్రామాల్లో పెద్ద మొత్తంలో పత్తి పంటలను సాగు చేస్తున్నారు. మండలంలో 1892 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు.
పత్తి పంటను సాగు చేసిన 50 శాతం మంది రైతులు పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఈ పంటనే నమ్ముకొని సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాక, ఆ సమయంలో తీవ్రమైన వర్షాలు కురవడంతో తెల్లబంగారం నల్లబడింది. ఆక్టోబర్, నవంబర్లో పత్తి ధర రూ.9వేల పైబడి ఉన్నా ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో రైతులు విక్ర యించ లేదు. ఇది కాస్త రోజు రోజుకూ ధర రూ. 6 వేలు 7 వేలు వరకు పలికింది. దీంతో రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఇష్టపడక ఇంటి పరిసరా ల్లోనే నిల్వ ఉంచుకున్నారు. ఈ నెలలో క్వింటాలు పత్తి ధర రూ. 8,200 పలకడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇంట్లో ఉన్న పత్తిని రైతులు విక్రయించేందుకు పోటీ పడి జిన్నింగ్ మిల్లులకు తరలిస్తున్నారు.
తనకున్న 6ఎకరాల్లో మొత్తం పత్తి పంట సాగు చేశా. వర్షం వల్ల పత్తి దిగుబడి రాలేదు. క్వింటా లుకు రూ. 6200 ధరతో అమ్మాను. ఉంచు కుందామంటే జాగా లేక వచ్చింది వచ్చినట్ల అమ్మినాను. చానా బాధపడుతున్న. ఇప్పుడు మంచి ధరకు అమ్ముకుంటున్నారు. సర్కారు రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నది
– మారుతీ పటేల్(మాడెగాం)
పత్తి ధర పెరుగుతుందని ఇంట్లోనే నిల్వ ఉంచి నా. పది రోజులు నుంచి రూ.క్వింటాలు ధర రూ.7900 నుంచి ధర రూ.8200 పెరుగు తూ వచ్చింది. తన వద్ద ఉన్న సగం పత్తిని మూడు రోజుల క్రితం అమ్మినా. ఇంకా ధర పెరుగు తుందనే నమ్మకంతో మరో 50 క్వింటాళ్ల పత్తిని నిల్వఉంచినా.
– పరశురాం పటేల్