విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు చదువులో ప్రోత్సాహం అందించడానికి భవనాలు, వసతి గృహాలను గతంలోనే తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.25.48 కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించింది. జిల్లా వైద్యశాఖ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనం పనులు చకచకా కొనసాగుతున్నాయి. సకల సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తుండగా.. విద్యార్థుల సమస్యలు తీరనున్నాయి.
– ఆదిలాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా 2013 సంవత్సరంలో నర్సింగ్ కళాశాల మంజూరైంది. ప్రస్తుతం కళా శాల పదేండ్లుగా రిమ్స్లోని మూడో అంతస్తులో కొనసాగుతోం ది. ఇందు లో 244 మంది విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసి స్తున్నారు. తాత్కాలిక భవనంలో సౌకర్యాలు సరిగా లేక విద్యా ర్థులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సమ స్యల పరిష్కారా నికి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత కాలంగా చర్యలు చేపట్టింది. భవన నిర్మాణానికి పట్టణం, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల కోసం అధికారులు అన్వేషించినా అనువైన స్థలం దొరుకలేదు. దీంతో భవన నిర్మాణంతో కొంత జాప్యం జరిగింది. జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలోని పాత భవనాన్ని తొలగించి కొత్త బిల్డింగ్ నిర్మించ డానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసి గత ప్రభుత్వానికి పంపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవనం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25.48 కోట్లు మంజూరు చేసింది. దీంతోపాటు ఫర్నిచర్, ఇతర సదుపాయాలకు రూ.12.51 కోట్లు కేటాయించింది. ఆగస్టు 10న భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జీ ప్లస్ త్రీ విధానంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒక భవనం కళాశాల తరగతి గదుల కోసం, మరో భవనం విద్యార్థుల వసతి గృహాల కోసం నిర్మిస్తున్నారు. యేడాది లోగా నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ భవనం అందుబాటులోకి రానుడడంతో విద్యార్థుల అన్ని సౌకర్యాలు కలుగుతాయి.