ఇంద్రవెల్లి, నవంబర్ 26 : మండలంలోని కెస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవాలు డిసెంబర్ 12 నుంచి18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మెస్రం వంశీయులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లో భూమి చదునుతోపాటు అలయంలో పాలరాతితో ప్రత్యేకమైన ఫ్రేమ్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాల కోసం వైరింగ్ పనులు చేపడుతున్నారు. వివిధ రకాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. నాగోబా ఆలయం లోపల ఎటుచూసిన అందమైన డిజైన్లు కనిపిస్తున్నాయి. మెస్రం వంశీయులు అన్ని పనులు దగ్గరుండి చేయిస్తున్నారు.