కడెం, అక్టోబర్ 4 : నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభకు ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండ లాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ప్రత్యేక వాహనాల ద్వారా జై తెలం గాణ అంటూ నినాదాలు చేస్తూ నిర్మల్కు తరలి వెళ్లినట్లు ఎంపీపీ అంథోని అలెగ్జాండర్, పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ తెలి పారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 4 : ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లారు. మండలంలోని 24 గ్రామాల నుంచి ఆయా సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతల అధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. చిన్నం రవి, పులివేని సత్యనారయణ, చిలివేరి మల్లేశ్, గుమ్ముల లింగన్న, గడ్డం శ్రీని వాస్, సిరిపురం మహేశ్, నర్సింగ్, బల్గం రమేశ్, ఎర్రన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దస్తురాబాద్,అక్టోబర్ 4 : మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద వాహనాల్లో బయలు దేరి ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.