మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 8 : అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, నాలుగు నెలల పాలనలో రైతాంగాన్ని అధోగతి పాలు చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావులతో కలిసి ఆయన మాట్లాడారు.
పంటలు ఎండిపో యి రైతులు, గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 209 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయారని స్వయంగా సీఎం అనడం సిగ్గుచేటన్నారు. హామీలిచ్చి అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది రేవంత్రెడ్డి ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశా రు. డీడీలు కట్టిన గొల్లకుర్మలు, మత్స్యకారుల సంగతేమిటని ప్రశ్నించారు.
పద్మశాలీల ఆత్మహత్యలు ఆపాలని, చేనేత కార్మికుల వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో ప్రతి రోజూ తాగునీరందించామని, కానీ ఈ ప్రభుత్వానికి అ లాంటి ఆలోచనే లేదన్నారు.తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకాక ముందు ఏ పరిస్థితులున్నా యో.. ఇప్పుడూ అవే పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. టెట్ పరీక్ష ఫీజు రూ. 200 ఉంటే రూ. 1000 చేశారని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వారి నడ్డివిరుస్తున్నారని పేర్కొన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు ఎప్పుడు వేస్తారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
గ్యారెంటీలు ఏమయ్యాయి : బాల్కసుమన్
ఆరుగ్యారెంటీలు అని చెప్పి, అధికారంలోకి రాగానే ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రజలను కోరారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని ఇవ్వలేదని, బీఆర్ఎస్ హయాంలో రూ. 77వేల కోట్లు రైతుబంధు కోసం కేటాయిస్తే ఎన్నికల్లో గెలిచాక ఆ నిధులను వారికి అనుకూలమైన కాంట్రాక్టు సంస్థల జేబుల్లోకి మరల్చారని ఆరోపించారు. క్వింటాలుకు రూ. 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు ఏవని ప్రశ్నించారు. ప్రచార ఆర్బాటాలే తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేశారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బలహీన పడిందని మాట్లాడుతున్న కాంగ్రెస్.. మరి తమ నాయకులను ఎందుకు చేర్చుకుంటుందని, వారికి టికెట్లు ఎందుకు ఇస్తున్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే.. మోసానికి, కుట్రలకు నిదర్శనమని చెప్పారు. ప్రజాసంక్షేమం పక్కన పెట్టి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టి బస్సుసర్వీసులను తగ్గించారని, ఆటో డ్రైవర్ల బతుకులను ఆగం చేశారని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత ఒప్పందం ప్రకారమే ముందుకు సాగుతున్నాయని, అందులో భాగంగానే అనేక స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను కాంగ్రె స్ బరిలోకి దింపుతున్నదని చెప్పుకొచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు హర్ష ఖరీదైన వాచీల కొనుగోలు విషయంలో చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయమై స్పందించాలని డిమాండ్ చేశారు.
నీటి ఎద్దడి లేకుండా చూడాలి : దివాకర్రావు
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేనడిపెల్లి దివాకర్రావు అన్నారు. గతేడాది పుష్కలంగా ప్రాజెక్టులు, బావులు, బోర్లలో నీరుండేదని, మేడిగడ్డ ప్రాజెక్టుకు ఉద్దేశ పూర్వకంగానే మరమ్మతులు చేపట్టలేదని, దాంతో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతుందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం ఓట్లకోసమే రామమందిరం అంటుందని, అందరికీ రాముడు దేవుడేనని, వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని జైళ్లకు పంపే సంస్కృతిని ఆ పార్టీ తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, గోగుల రవీందర్రెడ్డి, సందెల వెంకటేశ్, తోట తిరుపతి, అంకంనరేశ్, గాదెసత్యం, ఎర్రం తిరుపతి, శ్రీపతి వాసు పాల్గొన్నారు.