జైనూర్ : విద్యార్థులు కంప్యూటర్ విద్యను( Computer Education ) సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ ( Yuvaraj Marmat ) కోరారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం రాసి మెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం సందర్శించారు .
కంప్యూటర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏఐ ద్వారా బోధన చేపట్టనున్నామని వెల్లడించారు. ఏఐ విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన బాలికలు వచ్చే పది సంవత్సరాలల్లో ప్రపంచ డిజిటల్ విద్యను అందుకునే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న మైండ్ స్పార్క్, తెలుగు, ఆంగ్లం గణితం సబ్జెక్టులలో విద్యార్థి వారిగా ప్రగతిని తెలుసుకున్నారు. విద్యార్థులకు లాప్టాప్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎంవో జగన్, జీసీడీవో శకుంతల, టీటీడీవో శ్రీనివాస్, హెచ్ఎం అనిత, మైండ్ స్పార్క్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ భీమ్రావు , విద్యార్థులు పాల్గొన్నారు.