బోథ్, డిసెంబర్ 18 : మండలంలోని కుచులాపూర్ క్రాస్రోడ్డు నుంచి ధన్నూర్(బీ) మీదుగా ఖండిపల్లె వరకు చేపట్టిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ 6.52 కోట్లు మంజూరు చేసింది. ఖండిపల్లె నుంచి పాత రోడ్డు తొలగించే పనులు, ఎక్స్కవేటర్తో బీటీ, కంకర, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. తవ్వకం పనులు పూర్తయిన చోట మట్టి మొరం పోయడం, బ్లేడ్ ట్రాక్టర్తో చదును, రోడ్డు రోలర్తో తొక్కిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్ ట్యాంకర్తో నీటిని పట్టిస్తూ రూలింగ్ చేస్తున్నారు. ఖండిపల్లె వైపు నుంచి మట్టి మొరం పూర్తయిన చోట కంకర మిక్స్, జీఎస్బీ వేసి పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లోగా రోడ్డు పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్అండ్బీ డీఈఈ సునీల్ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండడంతో ఈ ప్రాంతంలోని కుచులాపూర్, ధన్నూర్ (బీ), నాగాపూర్, జైనూర్పల్లె, దర్బతండా, ధన్నూర్(కే), బీర్లగొంది, మందబొగూడ, కుచ్చిరాలతండా,
అధ్వానంగా మారిన రోడ్డుతో దశాబ్దాల కాలంగా అష్టకష్టాలు పడ్డాం. వర్షాకాలంలో నరక యాతన అనుభవించాం. ఇప్పుడు రోడ్డు పనులు మొదలుకావడంతో మా ఇబ్బందులు త్వరలోనే తొలగిపోనున్నాయి. బోథ్ మండల కేంద్రానికి వెళ్లే దారి గుంతలమయం కావడంతో అక్కడికి గంట సమయం పట్టేది. ఇప్పుడు పది నిమిషాల్లో చేరుకునే వీలు కలుగనుంది.
పవార్ గణేశ్, గ్రామస్తుడు, బీర్లగొంది
రోడ్డంతా గుంతలుగా మారడంతో ఆటో నడపడానికి ఇబ్బందిగా ఉండేది. నిత్యం ఏదోచోట ఆటోకు మరమ్మతులు అవసరమయ్యేవి. రోడ్డు పనులు చురుగ్గా సాగుతుండడంతో మా కష్టాలు త్వరలో తొలగిపోనున్నాయి. ప్రస్తుతం మొరం పనులు పూర్తికావడంతో ఆటోను తొలడం సులువుగా మారింది.
-పంద్రం మహేందర్, ఆటో యజమాని; అందూర్