మంచిర్యాల అర్బన్, మార్చి 23 : స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తిదాయకమని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి అజ్మీరా లాల్ కుమార్ అన్నారు. శని వారం భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగతో కలిసి ఆయన మాట్లాడారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ప్రశ్నించే గొంతులపై ఉప చట్టాలను ప్రయోగిస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో సీఏఏ తీసుకువచ్చారని, మోడీ మతోన్మాద, విద్యా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, నాయకులు సంధ్య, శ్రావణి, మహేశ్, శివ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, మార్చి 23: మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడడమే భగత్ సింగ్కు ఘనమైన నివాళి అని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి అన్నారు. షాహిద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ వర్ధంతి పురస్కరించుకొని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ( ఏఐఎస్బీ) జిల్లా నాయకులు కనుకుంట్ల సన్నీ గౌడ్ ఆధ్వర్యంలో బ్లడ్ మోటివేటర్ ప్రేమ్ కుమార్ సింగ్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో శనివారం 20 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు చైర్మన్ కే భాసర్ రెడ్డి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీ మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి చందూరి మహేందర్, కోశాధికారి కే.సతీశ్రెడ్డి పాల్గొని వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
కోటపల్లి, మార్చి 23: భగత్ సింగ్ వర్ధంతిని కోటపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బొలిశెట్టి బుచ్చన్న, అధ్యక్షురాలు భాగ్య, సీఏ రమాదేవి పాల్గొన్నారు.
కాసిపేట, మార్చి 23 : సోమగూడెం శిశు మందిర్ క్రీడా మైదానంలో వాకర్స్, క్రీడాకారుల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతిని నిర్వహించారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేసిన అమరవీరుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంకె రవి, రాజేందర్, మహేందర్, రామకృష్ణ, బోగె పోశం, శ్రీనివాస్, సురేశ్, రమేశ్, శివ, వెంకన్న, భూమన్న తదితరులు పాల్గొన్నారు.