నిర్మల్ టౌన్, డిసెంబర్ 28 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో భవన నిర్మాణ పనులపై బుధవారం సమీక్ష నిర్వహిం చారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సముదాయాల వద్ద రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు, రోడ్లను పరిశీలించి వేగంగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.