నిర్మల్ టౌన్, జనవరి 25 : అధునాతన సౌకర్యాలతో నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని ఎల్లపల్లి శివారులో కడుతున్న కలెక్టరేట్ భవనం పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి బుధవారం పరిశీలించారు. నూతన సమీకృత కలెక్టర్ భవనంలో అన్ని శాఖల కార్యాలయాలు ఉంటాయని, దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, బైపాస్ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులకు మంత్రికి వివరించారు.
అనంతరం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ అశోక్, జిల్లా అధికారులు శ్యాంరావు రాథోడ్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జగదాంబ ఆలయంలో మంత్రి పూజలు
సోన్, జనవరి 25 : నిర్మల్ మండలంలోని రాణాపూర్ గ్రామంలో గల జగదాంబ సేవాలాల్ ఆలయంలో ప్రేమ్సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పూజల్లో భా గంగా బుధవారం నవచండీ యాగం నిర్వహించా రు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొని పూజలు చేశా రు. ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, నాయకులు రాంకిషన్రెడ్డి, నాయకులు, తదితరులు ఉన్నారు.