ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 : ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు(టాస్) పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ పదో తరగతి పరీక్షల కోసం రెండు సెంటర్లు, ఇం టర్ కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, పదో తరగతికి చెందిన 368 మంది, ఇంటర్కు చెందిన 284 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, జిల్లా విద్యాధికారి అశోక్, డీఆర్వో లోకేశ్వరరావు, జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు ఉదయ్ బాబు, డీఆర్డీవో సురేందర్, జిల్లా వైద్యాధికారి తుకారాం బట్, భగీరథ ఈఈ వెంకటపతి, ఆర్టీసీ అధికారులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 : ప్రతి ఒకరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే నవభారత సాక్షరతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్తో కలిసి ఉన్నతాధికారులకు సంధాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 90,828 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, దశల వారీగా వీరందరినీ అక్షరాస్యలుగా మార్చాల్సి ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా గ్రామస్థాయిలో ప్రధానోపాధ్యాయులు సూపర్వైజర్గా, ఒక ఉపాధ్యాయుడు టీచర్గా, మరో ఉపాధ్యాయుడు సర్వేయర్గా విధులు నిర్వహిస్తారని, ఎప్పటికప్పుడు వివరాలను ఉల్లాస్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.