బాసర, ఏప్రిల్ 16 : బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధిపేట జిల్లా తోగుట్ట మండలం బండారుపల్లికి చెందిన అరవింద్ మంగళవారం ఉదయం తో టి విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా అరవింద్ ఒక్కడు గదిలోనే ఉన్నాడు. ఎవరూ లేని సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గదిలోకి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. అ ప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని నిర్మ ల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. విద్యార్థి వ్యక్తిగత కారణాలతో మృతి చెం దాడని అధికారులు తెలిపారు. ఈఘటన స్థలా న్ని సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్లు విచారణ చేపట్టనున్నారు.
కలెక్టర్, ఎస్పీ సీరియస్
ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టర్ ఆశీష్ సం గ్వాన్, ఎస్పీ జనకి షర్మిలలు బాసర ట్రిపుల్ ఐ టీకి వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. విద్యా ర్థి ఆత్మహత్యకు పాల్పడ్డ హాస్టల్ గదిని పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి హాస్టల్ గదిలో ఒక్కడే ఉన్నప్పుడు వార్డెన్ల పర్యవేక్షణ లేకుంటే ఎలా? విద్యార్థి అటెండెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఔట్ పాస్లు ఎందుకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా సిబ్బంది, ఫ్యాకల్టీ వారి యోగక్షేమాల గురించి శ్రద్ధ వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నట్లు సమాచారం.
ఐదు నెలల్లో ముగ్గురు ఆత్మహత్య
ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఐదు నెలల క్రితం నవంబర్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్కుమార్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతిచెందింది. తాజాగా మంగళవారం అరవింద్ హాస్టల్ గదిలోని ఉరి వేసుకుని చనిపోవడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న అరవింద్ హాజరు శాతం తక్కువ ఉంది. పరీక్షలకు అనర్హుడు కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడడమే కారణమా?హాజరు శాతం తక్కువ ఉండడమే కారణమా?
ట్రిపుల్ ఐటీ అధికారులు సోమవారం హాజరు శాతం తక్కువగా ఉన్న దాదాపు 100 మంది విద్యార్థుల జాబితాను హబ్లో పొందు పర్చారు. ఆ జాబితాలో అరవింద్ పేరు ఉంది. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ట్రిపుల్ ఐటీ నిబంధనలు ప్రకారం 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలు రాయడానికి అర్హులు. హాజరు శాతం అంతకంటే తక్కువ ఉంటే వచ్చే సంవత్సరం పరీక్షలు రాయవచ్చు. ఈ నెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాను పరీక్షకు అనర్హుడినని తెలియడంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హాస్టల్లో పర్యవేక్షణ కరువు
ట్రిపుల్ ఐటీలో 9 వేల మంది విద్యార్థులు ఉ న్నారు. ఇందులో బాలురు 3,500లకు పైగా ఉండగా, వార్డెన్లు మాత్రం 20 మంది మా త్రమే ఉన్నారు. దీంతో పర్యవేక్షణ కరువవుతున్నది. గత నెల మార్చి 6వ తేదీన 12 మంది ఉమెన్ కేర్ టేకర్స్కు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 13న ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినప్పటికీ రిక్రూట్మెంట్ మాత్రం జరగలేదు. ఇంటర్వ్యూలు జరిపి నెల రోజులకు పైగా అయిన వారిని ఉద్యోగంలోకి తీసుకోలేతు. దీంతో పర్యవేక్షణ కరువై ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
కానరాని వీసీ వెంకటరమణ
విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిన కూ డా ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ ట్రి పుల్ఐటీకి రాక పోవడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో నే ఉంటూ నెలకు రెండు లేదా మూడు సార్లు నామమాత్రంగా పర్యవేక్షించి వెళ్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడున్న డైరెక్టర్ పదవి కాలం ముగియడంతో ట్రిపుల్ఐటీలో పర్యవేక్షణ లోపించింది. కలెక్టర్, ఎస్పీ వచ్చినప్పటికీ కూడా ఇన్చార్జి వీసీ రాకపోవడం గమనార్హం.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. ఐదు నెలల కాలంలో ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతున్నది. గత నవంబర్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న నాగర్కర్నూల్కు చెందిన ప్రవీణ్కుమార్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లాకు చెందిన పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థి శిరీష హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. తాజాగా మంగళవారం అరవింద్ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని మృతిచెందాడు. దీంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.