ఎదులాపురం, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని కలెక్టర్ రాహుల్ రాహుల్ రాజ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయ ఆవరణలో జ్యోతిప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి అధికారులు, సంఘం నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరిలో ఉన్నత చదువులు చదివేలా చైతన్యం కలిగించారన్నారు.
ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యువత నూతన ఒరవడిని సృష్టించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి భగత్ సునీతా కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డీఆర్డీఏ కిషన్, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు నక్క రాందాస్, శోభ, ఆర్యసంఘమిత్ర, నాందేవ్ కాంబ్లే, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బోథ్, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కంది ప్రవీణ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ యాదవ్, ఎంపీటీసీ షేక్, సంఘం నాయకులు ఎలుక రాజు, దయాకర్, సంతోష్, చంటి, ముత్యం, రవి, నితిన్, లక్ష్మణ్, సన్ని, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 6 : మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మాల సంఘం నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు బత్తుల ఊశన్న, జిల్లా కార్యదర్శి బొజ్జ రవి, అధ్యక్షుడు శాంతాపూర్ రాజేశ్వర్, బొజ్జ రాజ్కుమార్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, డిసెంబర్ 6 : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భీం టైగర్ యూత్ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ డాక్టర్ మాధవ్ మస్కే, న్యాయవాది అజయ్ జోందళే, మాజీ ఉప సర్పంచ్ ససానే సిద్ధార్థ్, మాధవ్ ససానే, నాగ్నాథ్ అప్పా, కుశల్, కిషన్ బుద్ధే, మిలింద్ పవార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
సొనాల, డిసెంబర్ 6 : సొనాలలో అబేద్కర్ యువజన సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహనికి పాలతో అభిషేకం చేసి, పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ముందుగా గ్రామ యువజన నాయకులు, గ్రామస్తులు, మహిళలు అంబేద్కర్ భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ సదానందం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సొన్న హరీశ్, ఎమ్మార్పీస్ మండలాధ్యక్షుడు గడ్చంద దినేశ్, గాజుల పోతన్న, లంక లలిత, భగత్ ప్రవీణ్, సంతోష్, అమృత్ రావ్, సోమన్న, భీంరావ్ పాటిల్, బత్తుల రమేశ్, అడెల్లు, అనిల్, హరీశ్, విజయ్, మహేశ్వర్, లక్ష్మణ్, రాజు, సునీల్ పాల్గొన్నారు.
ఎదులాపురం, డిసెంబర్ 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్డాండ్ ముందు గల విగ్రహానికి దుర్గం ట్రస్ట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు అనిల్ సల్వే, శోభబాయి, మహేందర్, మోహన్, సూర్యవంశీ, రాహుల్, సూరజ్, సోను , విశ్వనాథ్, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నక్క రాందాస్, నాయకులు మోతే బారిక్రావ్, లింగపల్లి ప్రసన్నకుమార్, జువాక నర్సింహులు, కత్తి గంగాధర్, అశోక్, మహేందర్ పాల్గొన్నారు.
తాంసి(తలమడుగు), డిసెంబర్ 6 : అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని బ్లూ భీం యూత్ అధ్యక్షుడు ప్రేమేందర్ అన్నారు. తలమడుగులో బ్లూ భీం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు రవి, బాపన్న, కేశవ్, గంగాధర్, యూత్ సభ్యులు శేఖర్, ఆశన్న, సంజీవ్, చింటు, సురేశ్, ప్రశాంత్, రాములు, శివమణి, అజయ్, అశోక్, జాన్, సంతోష్, సందీప్, వినయ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
తాంసి, డిసెంబర్ 6: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్, సర్పంచ్ స్వప్న- రత్న ప్రకాశ్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కప్పర్ల గ్రామంలో యువకులు విరాళాలు సేకరించి గ్రంథాలయ నిర్మాణం చేపట్టడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, సర్పంచ్లు సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, కుంట సరిత- కేశవ్ రెడ్డి, మునేశ్వర్ భరత్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, చంద్రయ్య, మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, మహేందర్, కాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, సృజన్, కిరణ్, ప్రఫుల్, అరుణ్, రామన్న యాదవ్ పాల్గొన్నారు.
నార్నూర్, డిసెంబర్ 6 : నార్నూర్, గాదిగూడ, తాడిహత్నూర్, బొప్పాపూర్, మలంగి, కొత్తపల్లి(హెచ్), ఉమ్రి, మారేగావ్, దాబా(బీ), లోకారి(కే), బుద్ధగూడతో పా టు దళితవాడల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పరమేశ్వర్, మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ హేమలతబ్రిజ్జిలాల్, దేవ్రావ్, కేశవ్, శాంతారావ్, సునీల్, దుర్గే రుక్మాబాయి, మీనాక్షి పాల్గొన్నారు.