ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26 : బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత్ బోరడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సే వాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో ఎమ్మె ల్యే కోవ లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తన బోధనల ద్వారా బంజారాలను సన్మార్గంలో నడిపించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.
ప్రజా శ్రే యస్సు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ప్ర జలంతా ఐక్యంగా ఉండాలని, మహానీయులను ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు గోపాల్ నాయక్, సేవాలాల్ సమితి అధ్యక్షుడు రాంబాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవి నాయక్, నాయకులు విశ్వప్రసాద్, ఆత్మారామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని సందీప్నగర్లోగల శివాలయంలో శివరాత్రికి నిర్వహించే శివపార్వతుల కల్యాణ ఉత్సవాన్ని జయపద్రం చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం తన నివాసంలో కమిటీ సభ్యులతో కలసి వాల్పోస్టర్లను విడుదల చేశారు. అశోక్, శంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.