ఆసిఫాబాద్, ఫిబ్రవరి 22: పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్య, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్రావు, డీఈవో అశోక్, డీఐఈవో శంకర్, డీఎస్పీ కరుణాకర్, డీఎంహెచ్వో తుకారాం భట్, డీపీవో ఉమర్హుస్సేన్, ఎస్బీ సీఐ రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.