నస్పూర్, డిసెంబర్ 21 : ఎంపానెల్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్తో కలిసి టెండరు ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెండరు ప్రక్రియలో భాగంగా 52 టెండర్ షెడ్యూల్స్ చేయగా 52 బిడ్ చేశారని తెలిపారు.
2 టెండర్లు ఈఎండీ చెల్లించని కారణంగా రద్దు చేశామని, మిగతా షెడ్యూల్స్ అన్ని సక్మంగా పరిశీలించి ఎంపానెల్లో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా ఉపాధి కల్పన అధికారి, జిల్లా కోశాధికారి, జిల్లా కార్మిక శాఖ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకటరమణ, జిల్లా కోశాధికారి రాజేశ్వర్, కార్మిక శాఖ అధికారి వినీత, అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.