నస్పూర్, మార్చి 26 : లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలిం గ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష అన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల శానసనభ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందులో 1131 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1111 మంది సహా య ప్రిసైడింగ్ అధికారులు, 2187 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇక్కడ ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, ఈ డిస్ట్రిక్ మేనేజర్ సునీల్ పాల్గొన్నారు.